ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల విషయంపై.. సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

  • ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీలో జాప్యంపై లేఖ
  • గ్రూప్ వన్ ఎంపిక తీరు పట్ల అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారన్న బాబు
  • అస్మదీయుల కోసం అక్రమార్కులకు తెరతీశారని ఆరోపణ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీలో జాప్యంపై లేఖలో ఆయన ప్రస్తావించారు. గ్రూప్ వన్ ఎంపిక తీరు పట్ల అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. అస్మదీయుల కోసం గ్రూప్ వన్ లో అక్రమాలకు తెరతీశారని ఆరోపించారు. రెండు సార్లు విడుదల చేసిన ఫలితాల్లో తేడాతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. గ్రూప్ వన్ ఎంపికపై విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Letter

More Telugu News